అగ్రవర్గాల చేతిలో మునుగోడు ప్రజలు అణచివేతకు గురవుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Submitted by mallesh on Wed, 21/09/2022 - 12:05
RS Praveen Kumar said that the people are being oppressed by the upper classes

చౌటుప్పల్ సెప్టెంబర్ 20( ప్రజా జ్యోతి) .../ అగ్రవర్గాల ఆధిపత్య పోరు లో గత 75 సంవత్సరాలు మునుగోడు నియోజకవర్గ ప్రజలు అణిచివేతకు గురవుతున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రెండో విడత రాజ్యాధికార పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం లోని ఆందోళన మైసమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  పాదయాత్ర ప్రారంభించారు. బిఎస్సి పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. బీఎస్పీ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో బోనం సమర్పించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సర్దార్ పాపాన్న ధర్మ బిక్షం గౌడ్ ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాడుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోని అగ్రవర్గాల బందిఖానాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను విముక్తి చేసేందుకు, రాజ్యాధికార యాత్ర ప్రారంభించనన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి మునుగోడు గడ్డ మీద బీఎస్పీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో గెలుపొంది తెలంగాణ రాష్ట్రంలో నీలి జెండా ఎగరవేసి, దొరల చేతిలో బందీలైన తెలంగాణకు విముక్తి కలిగిస్తామని పేర్కొన్నారు.

బిజెపి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో బందీలైన బహుజన బిడ్డలను బీఎస్పీ పార్టీలోకి  వచ్చేలా చూడాలని ఆందోలు మైసమ్మ తల్లిని వేడుకున్నానని తెలిపారు, కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలో బందీలుగా బతుకుతున్న బహుజన బిడ్డలారా, కన్నతల్లి లాంటి బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చి అమరుల త్యాగాల వలన ఏర్పడ్డ, తెలంగాణ రాష్ట్రం ను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎస్సి పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కామేశ్వరరావు, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ మంద ప్రభాకర్, నకిరేకల్ నియోజకవర్గ బిఎస్సి పార్టీ ఇంచార్జ్ మేడి ప్రియదర్శిని, దయానందరావు, కత్తుల పరమేష్,  మస్క్ నరసింహ ,సుభాష్ చంద్రబోస్ ,పల్లె లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.