ఎన్నెస్పి అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

Submitted by venkat reddy on Thu, 08/09/2022 - 16:37
The reason for the accident was the negligence of NESPI officials

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు.

నిడమనూరు, సెప్టెంబర్08(ప్రజాజ్యోతి):ఎన్నెస్పి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు వేంపాడ్ స్టేజీ సమీపంలోని నారేళ్లగూడ మేజర్ కు దెగ్గర లో  బుధవారం సాయంత్రం గండి పడి ప్రాణ నష్టం నుండి ప్రమాదం తప్పింది.వందలాది ఎకరాలు వరి పొలాలు కొట్టుకుపోయి నీటమునిగి పోయాయి.హైవే రోడ్డు పూర్తి గా ధ్వంసం అయింది.నిడమనూరు, నర్సింహాల గూడెం గ్రామాలలో ఇండ్లలో కి వరద నీరు వచ్చి ప్రజలు భయందోళనలకు గురికి ఎన్నెస్పి అధికారుల నిర్లక్ష్యం మే కారణం అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని, పంట పొలాలను సీపీఎం, రైతు సంఘం బృందం తో కలిసి పరిశీలించి అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఆధునికరణ లో భాగంగా సుమారు రూ.4444.4కోట్ల తో పనులు చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అధికారులు పర్యవేక్షణ లేకుండా నాసిరకం పనులు చేయడం వల్లనే బుధవారం ప్రమాదం జరిగిందని అన్నారు.గత మూడు, నాలుగు రోజులుగా కట్ట వెంట లికేజి వస్తున్నా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రమాదం జరిగింది. బుధవారం ప్రమాదం అర్ధరాత్రి జరిగివుంటే ప్రమాదం అంచనా వేయలేకపోయే వాళ్ళమన్నారు.గురుకుల పాఠశాల పూర్తిగా నీట మునిపోయిందని సాయంత్రం కావడం వల్ల స్థానికులు ప్రమాదంను గమనించి విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది అన్నారు.

ఇండ్లు, కొన్ని వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయని, సుమారు 1000ఎకరాలు వరి పంట పూర్తి గా నష్టపోయిందని కష్టపడి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి నాటు పెడితే చిరు పొట్ట దశ లో ఇలా జరగడం రైతులకు తీవ్రంగా ఆర్థికంగా నష్టం జరిగింది అని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. నష్ట పోయిన రైతంగానికి ఎకరానికి 30వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆడుకోవాలని యుద్ద ప్రాతిపదికన గండి పూడ్చి మిగతా పంటలకు సకాలంలో నీరందించాలని ప్రమాదం కు కారకులైన ఎన్నెస్పిఅధికారుల పై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటన లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి లేకుంటే సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, రైతు సంఘం జిల్లా నాయకులు మంగారెడ్డి, కోమాండ్ల గురువయ్య, వెంకట్ రెడ్డి, ఖమ్మం పాటి శంకర్, ఆకారపు నరేష్, కుంచెం శేఖర్, రమేష్, కేశవులు, పుల్లయ్యతదితరులు పాల్గొన్నారు.