బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత -మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 15:12
Providing financial assistance to the affected family  - Former MLA Kusukuntla Prabhakar Reddy

నాంపల్లి,అక్టోబర్ 01(ప్రజాజ్యోతి) : మండలంలోని పసునూర్ గ్రామానికి చెందిన కార్యకర్త తల్లి కేషమల్ల నర్సమ్మ ఇటీవలే మరణించడం జరిగింది. వెంటనే జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి విషయాన్ని తెలుసుకొని మునుగోడు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  5000 రూపాయల ఆర్థిక సహాయం పసునూర్ మాజీ సర్పంచ్ పోగుల వెంకట్ రెడ్డీ ద్వారా పంపించిగా మృతుని కుటుంబాన్నీ పరామర్శించి, ఆర్థిక సహయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల్ కో ఆప్షన్ సభ్యులు ఎస్కె.అబ్బాస్ ,వార్డు సభ్యులు వెంకన్న, రైతు బంధు కమిటీ గణపురం సర్పంచ్ వారి టీమ్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.