ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 16:18
The problems raised in public should be resolved   Additional Collector Bhaskar Rao

నల్లగొండ సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి)ప్రతినిధి:  ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించవలసినదిగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు.ప్రజల నుండి అందిన  అట్టి ఫిర్యాదులను  ఆయా శాఖాధిపతులకు అందజేస్తూ  ప్రజావాణిలో తమ సమస్యలు చెబితే పరిష్కారమవుతాయనే నమ్మకంతో వాగుతారని, వారిని ఆశలను ఒమ్ము చేయకుండా పరిష్కరింపదగ్గ వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.