ఆర్థిక సహాయం అందజేసిన పాల్వాయి స్రవంతి రెడ్డి

Submitted by mallesh on Thu, 15/09/2022 - 11:01
Palvai Sravanti Reddy who provided financial assistance

చౌటుప్పల్ సెప్టెంబర్ 14 ప్రజా జ్యోతి. ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి మరణించిన  చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగారెడ్డి గూడెం కు చెందిన తూర్పునూరు హనుమంత్ గౌడ్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చేశారు. ఆర్థిక సహాయంగాను 10 వేల రూపాయలను  మృతుడు హనుమంతు గౌడ్ కుటుంబ సభ్యులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో  సుర్వి నరసింహ గౌడ్, లందగిరి భీమయ్య, ఊదరి శ్యామ్ సుందర్, చెరుకు లింగస్వామి , సుక్క కృష్ణ, చిన్న వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.