పూస పల్లి లో బైక్ యాత్రను ప్రారంభించిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు
మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి): గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రజా- గోస బిజెపి భరోసా యాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా8 వ రోజు ప్రజా గోస- బీజేపీ భరోసా యాత్ర మహబూబాబాద్ రూరల్ మండలం పూసపల్లిలో బైక్ యాత్రనుముఖ్య అతిధి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు ప్రారంభించారు. ఈ బైక్ యాత్రలో పాల్గొన్న ప్రత్యేక అతిథులు మాజీ ఎంపీ సురేష్ మరియు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోతు హుస్సేన్ నాయక్ , జిల్లా అధ్యక్షులు శ్రీ వద్దిరాజు రామచంద్ర రావు, జిల్లా మాజీ అధ్యక్షులు ఎప సీతయ్య,మహబాద్ రూరల్ మండల బిజెపి అధ్యక్షులు నవీన్ నాయుడు,కేసముద్రం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శశివర్ధన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శులు వల్లభు వెంకటేశ్వర్లు, చెల్పూరి వెంకన్న ,ఎంపీటీసీ మదన్ ,జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇందు భారతి ,జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు రాంబాబు నాయక్ తదితర బిజెపి జిల్లా నాయకులు, బైక్ యాత్ర బృందం పాల్గొన్నారు.
- 6 views