కొనసాగుతున్న కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు

Submitted by venkat reddy on Wed, 28/09/2022 - 08:32
Ongoing Kanakadurga Navratri celebrations

నిడమనూరు, సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి)ః  నిడమనూరు మండలకేంద్రంలో  కనకదుర్గదేవి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. కనకదుర్గ శరనవరాత్రి  ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కనక దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలు  జరుగుతున్నాయి.ఈసందర్భంగా మంగళవారం నిడమనూరు కనకదుర్గమ్మ అమ్మవారుగాయత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కనకదుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు జమలుపూరి నర్సింగ్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులుపంతులు తుకారం,గౌరు సాయి రాకేష్, సోమవరపు శ్రీను, నాగేశ్వరరావు, లికేష్‌,డి.యశ్వంత్, సందీప్, పవన్, నాగరాజు,సంజయ్, చౌదరి, అరుణ్, శ్యామ్, రోహిత్, చౌదరి, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.