నర్సంపేట ఆగస్టు 30 (ప్రజా జ్యోతి)
జనగాం జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామానికి చెందిన ఆర్టీసీ నర్సంపేట డిపో సీనియర్ అసిస్టెంట్ (పి) ఆరుట్ల యాదగిరిస్వామి పదవీ విరమణ మంగళవారం డిపో మేనేజర్ కార్యాలయంలో డీఎం కె. బాబునాయక్ ఆధ్వర్యంలో శాలువా, పుష్పగుచ్చం, ప్రత్యేక బహుమతులతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా డిపో మేనేజర్ బాబునాయక్ మాట్లాడుతూ... స్వామి డిపోలో 11 సంవత్సరాల నుండి పని చేస్తున్నారని, మొత్తం ఆర్టీసీ సంస్థలో 37 సంవత్సరాల నుండి అందించిన సేవలు ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సహాయ మేనేజర్ ఎస్వీ చారీ, ఎంఎఫ్ అమల, హెడ్ కానిస్టేబుల్ బల్గూరి వీరారెడ్డి,ఎన్వీ రెడ్డి,యాకూబ్ రెడ్డి,వీరస్వామి,శ్రీనివాస్,డీఐ బండి బాబు,ఆర్టీ హరిప్రసాద్,గొలనకొండ వేణు,నాగిశెట్టి ప్రవీణ్, పిన్నింటి రజిత వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.