- తెలంగాణ ప్రభుత్వంలో నూతన పట్టణాలకు ప్రాధాన్యత
- పట్టణాల అభివృద్ధి కేసీఆర్ లక్ష్యం
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి
నల్లగొండ అక్టోబర్ 02(ప్రజాజ్యోతి)ప్రతినిధి: నల్లగొండ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల్ మండలం లో పరిపాలన కార్యాలయం లు తహశీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఆదివారం ప్రారంభించారు.అనంతరం గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.తర్వాత పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు.మంత్రి తో పాటు రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,ఎం.ఎల్.సి. నర్సి రెడ్డి,మాజీ శాసన సభ్యులు కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,అర్.డి. ఓ జగన్నాథ రావు,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను పట్టణంగా తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని అన్నారు. గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
- 16 views