నాగారం అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి)./....నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో కోట మైసమ్మ గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర యాదగిరి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల దాహార్తిని తీర్చడం కోసం, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధమానుకోట ఎంపీటీసీ వడ్డే పరుశరాములు, ఉప సర్పంచ్ ఎర్ర నరేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- 4 views