- చిప్పలపల్లి మహేంద్ర నాథ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కూరు
అడ్డగూడూర్ సెప్టెంబర్ 13( ప్రజా జ్యోతి న్యూస్) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గపేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షనీయంచరిత్రాత్మక నిర్ణయమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో చిత్తశుద్ధితో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తుందో అంతే నిబద్దతతో చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి ఆ మహనీయునికి అంకితం చేయాలని తెలిపారు ఈ తీర్మానం చెయ్యడం అంబేడ్కర్ పట్ల మరియు దళిత వర్గాల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కి మరియు తెరాస పార్టీ కి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఈ తీర్మానాన్ని ఆమోదం తెలిపిన మంత్రులకు శాససభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు