మునుగోడు అడ్డ బహుజనుల అడ్డ : అర్ ఎస్ ప్రవీణ్ కుమార్

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 12:50
Munugodu Adda Bahujanula Adda : RS Praveen Kumar

మునుగోడు సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి): హలో బహుజనా.. చలో మునుగోడు.. రెండవ విడత రాజ్యాధికార యాత్రలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన మునుగోడు మండల కేంద్రానికి విచ్చేసిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర రథ సారథి అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనులు ర్యాలీతో బారి యెత్తున స్వాగతం పలికారు.అర్ ఎస్ రాకతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చింది.అనంతరం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల నుండి మా మునుగోడు గడ్డను మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను అగ్రవర్ణాల్లో ఉండే పేద బిడ్డలను అందరినీ మీ బూటు కాలు క్రింద మా బ్రతుకులు చింద్రంచేసిండ్రు.కానీ ఈరోజు మునుగోడు గడ్డమీద నీలి జెండా ఎగిరిందన్నారు.. ఒకడు తిన్నది అరగక రాజీనామ చేస్తారు..మరొకరు దోపిడీలు చేసేందుకు రాజీనామ చేస్తరు అని,8 సంవత్సరాల నుండి 1300 మంది అమరవీరుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఓ కుటుంబ కబ్జాలో ఉన్నదని,ఆ కుటుంబాన్ని తెలంగాణ నుండి విముక్తి చేయాల్సిన బాధ్యత మనందరిపై వుంది.మన పేద ప్రజల ఆస్తులన్నీ అంబానీలకు ఆదానిలకు తాకట్టుపెట్టి కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న నరేంద్ర మోడీ, అమిత్ షా రాజగోపాల్ రెడ్డిలను ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.

ఈ కార్యక్రమములో రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్,కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయనంద్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు యెర్రా కామేష్,కందికంటి విజయ్ కుమార్,నిషాని రాంచంచంద్రం,డిప్యూటి మేయర్ ఇబ్రహీం శేఖర్,మహతి రమేష్, జడి రాజు,వెంకటేష్ చౌహన్,,జిల్లా అధ్యక్షుడు పుదారి సైదులు,అనిత రెడ్డి,నర్రా నిర్మల,అసెంబ్లీ అధ్యక్షుడు పల్లె లింగస్వామి, పంభాల అనిల్ కుమార్,పందుల హరీష్, మాలిగ యాదయ్య,ఆందోజు శంకరా చారి,వెంకన్న, పందుల వెంకన్న, సురేష్, జనార్ధన్.తీగల రమేష్ తదితరులు పాల్గొన్నారు