మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి): మహబూబాబాద్ జిల్లాకేసముద్రం మండలంలోని హరిహర గార్డెన్స్ లోగురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని చిరు వ్యాపారులకు, రైతు రుణాలకు సంబంధించిన లబ్ధిదారులకు 30 లక్షలు విలువచేసే చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ డైరెక్టర్ మర్రి రంగా రావు, నజీర్ అహ్మద్, కముటం శ్రీను, దుర్గేష్, యాళ్ల మురళీధర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు మరియు తదితరులు ఉన్నారు.
- 12 views