నేడు ఉర్కొండ మండలానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాక ఎంపీపీ రాధ

Submitted by md yusuf on Thu, 08/09/2022 - 09:33
MLA Lakshmareddy's arrival in Urkonda mandal today MPP Radha

ఉర్కొండ సెప్టెంబర్ 7(ప్రజా జ్యోతి) ; మండలంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకస్థాపనలు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పించన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి జడ్చర్ల శాసన సభ్యులు చేర్లకొల లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారనీ ఎంపీపీ రాధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లు శంకుస్థాపన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం ఎంపీపీ నిధుల నుండి అండర్ డ్రైనేజీ పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ దగ్గర నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ మండల కేంద్రంలో తెరాస మండల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని మండల ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు.