పాము కాటుకు గురైన సర్పంచ్ తొ పాటు పలువురిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

Submitted by narmeta srinivas on Fri, 11/11/2022 - 20:12
పలువురు కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ

పలువురు కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ

కొడకండ్ల / పాలకుర్తి (ప్రజాజ్యోతి) నవంబర్ 11 : చెరువు ముందు తండా గ్రామపంచాయతీ సర్పంచ్ సునీత యాకూబ్ ఇటీవల పాముకాటుకు గురై అస్వస్థతకు గురికాగా శుక్రవారం సర్పంచ్ సునీతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్మెట రాము, నర్మెట శ్రీనుల తల్లి నర్మెట రాములమ్మ ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.గ్రామ రైతు బంధు అధ్యక్షుడు గార్లపాటి ఉపేందర్ రెడ్డి తల్లి. ఇటీవల మృతిచెందగా ఉపేందర్  రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. టిఆర్ఎస్ నాయకులు కోట పెద్ద బుచ్చి రాములు ,దూదిగాని గురువయ్య ,అందే సోమయ్య సతీమణి ఎల్లమ్మ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాలను మంత్రి పరామర్శించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లవేలలా అందుబాటులో ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో డి‌సి‌సి‌బి వైస్ ఛైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి,టిఎస్ఈజిసి డైరెక్టర్ అందె యాకయ్య,టి‌ఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ,సర్పంచ్ పసునూరి మధుసూదన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పేరం రాము,ఎం‌పి‌టి‌సి కుందూరు విజయలక్ష్మి అమరేందర్ రెడ్డి, కోఆప్షన్ నసీర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.