జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Submitted by narmeta srinivas on Fri, 11/11/2022 - 21:10
జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి)  నవంబర్ 11 : కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన మెట్రో ఈవినింగ్స్ జర్నలిస్ట్ దూదిగాని నాగరాజు తండ్రి దూదిగాని గురువయ్య టీఆర్ఎస్ నాయకుడు కొద్ది రోజుల క్రితం మరణించగా బాధిత కుటుంబాన్నిశుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో డి‌సి‌సి‌బి వైస్ ఛైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి,టిఎస్ఈజిసి డైరెక్టర్ అందె యాకయ్య,టి‌ఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ,జిసి‌సి మాజీ ఛైర్మన్ గాంధీ నాయక్ ,సర్పంచ్ పసునూరి మధుసూదన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పేరం రాము,ఎం‌పి‌టి‌సి కుందూరు విజయలక్ష్మి అమరేందర్ రెడ్డి, కోఆప్షన్ నసీర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.