తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధున్ని సన్మానించిన మందుల సామెల్

Submitted by Upender Bukka on Sat, 17/09/2022 - 11:10
Medicine collection honoring the Telangana armed peasant fighter

నాగారం ప్రజా జ్యోతి  సెప్టెంబర్ 16. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ,సీఎం కేసీఆర్ 16, 17, 18 తేదీలలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ నాగారం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డిని హైదరాబాదులో పూలమాల వేసి శాలువాతో ఘనంగా  సన్మానించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సాయుధ రైతంగ పోరాట యోధులను సన్మానించుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. జాతీయ సమైక్యత ర్యాలీలో ప్రజల్లో జాతీయత స్ఫూర్తి ఏర్పడుతుందని తెలిపారు.