లింగాపూర్ సెప్టెంబర్ 22, (ప్రజాజ్యోతి) ..// ఈ నెల 28న ఎస్ ఎం గార్డెన్స్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ద్వితీయ మహాసభలు జరుగుతాయని, వీటిని జయప్రదం చేయాలని టి డబ్ల్యూ జే జిల్లా కార్యవర్గ సభ్యులు చవాన్ రామేశ్వర్ కోరారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి యు డబ్ల్యూ జే) జిల్లా ద్వితీయ మహాసభలకు జర్నలిస్టులు భారీ సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి ముఖ్య అతిథులుగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విరహతా అలీ, టియుడబ్ల్యూ జే కొమరం భీం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహేమాన్, జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ కుమార్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జాదవ్ విజయ్ కుమార్,రాథోడ్ వినోద్, చంద్రబాన్,నేతవత్ రాజేందర్ లు పాల్గొన్నారు.
- 2 views