కమలక్క త్యాగం మరువలేనిది.

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:06
 Kamalakka's sacrifice is unforgettable.


ప్రజాఉద్యమంలో ఈసం కమలక్క త్యాగాలు మరువలేనివవి.

పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఇ.శ్రీశైలం

కొత్తగూడ  సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి) మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన ఈసం కమలక్కఅనారోగ్య రీత్యా మరణించగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఈసం కమలక్కకు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఈ శ్రీశైలం మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో ఈసం  కమలక్క త్యాగం మరువలేనిది అని భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం ఏజెన్సీ పోడు భూముల హక్కుల రక్షణ కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులలో ఈసం కమలక్క త్యాగం కూడా మరువలేనిదని ఈ సందర్భంగా అన్నారు.ఈసం కమలక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా నివాళులర్పించి వారు మాట్లాడుతూ కమలక్క చూపిన ఉద్యమ బాటలో ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతుకూలీ సంఘం మండల కార్యదర్శి యాదగిరి యుగంధర్ ,ముస్మి  గ్రామ పార్టీ అధ్యక్షులు గట్టి సురేందర్, లడాయిగడ్డ గ్రామ పార్టీ అధ్యక్షులు పిట్టల దేవేందర్, సభ్యులు రాస మల్ల రవీందర్, రాచమల్ల శ్రీను, కుంజా రాజశేఖర్, రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.