తొర్రూరు సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి) ../ దేశం గర్వించదగ్గ విప్లవకారుడు అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప దేశభక్తులు భగత్ సింగ్ 115 వ జయంతి సందర్భంగా వరుణ్ సిద్ధార్థ్ అండ్ అసోసియేట్స్ వారి సౌజన్యంతో ఎస్ఎఫ్ఐ తొర్రూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ ఆదివారం రోజు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించనున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వరుణ్ సిద్ధార్థ (సిఏ) మాట్లాడుతూ విద్యార్థులు యువత ఈ రోజులలో చెడు అలవాట్లకు బానిస అవుతున్నారని విద్యార్థులు యువత జీవితంలో ఎదగాలంటే ఏదో ఒక రంగాన్ని ప్రొఫెషనల్ గా తీసుకొని జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగాలని ఈ క్రీడా పోటీలు నిదర్శనంగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజంగా భావించి క్రీడా స్ఫూర్తిని చాటాలని విద్యార్థులు యువత క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని వారు అన్నారు. క్రీడల వలన మానసి కొల్లాసం దృఢత్వం ఏర్పడుతుందని వారు అన్నారు. ఈ క్రీడలలో పాల్గొనేవారు ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఎవరైనా క్రీడా పోటీలలో పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్లను సంప్రదించగలరు 6304552618,8555910692.ఈ కార్యక్రమంలో దీకొండ రాహుల్, ఉపేందర్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లవిశెట్టి ప్రసాద్ , జిల్లా సహాయ కార్యదర్శి మాలోతు సురేష్ బాబు, డివిజన్ నాయకులు శివరాత్రి వెంకటేష్ నాయకులు ప్రకాష్ ,వంశీ,రాజు,సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్