నాగారం ప్రజా జ్యోతి 29 ./....మండల కేంద్రంలోని డి కొత్తపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుండెబోయిన సైదులు ఇటీవల అకాల మరణం చెందారు. గురువారం వైస్ ఎంపీపీ మణిమాల ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. సైదులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. గుండబోయిన సైదులు మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు. తెరాస పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండదండగా ఉంటామని పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో సర్పంచ్ యారాల నరసింహారెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.
- 4 views