ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు పోరాడుతున్న ఎస్ టి యు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 16:41
 STU is fighting for the welfare of teachers

తెలకపల్లి, సెప్టెంబర్ 22( ప్రజాజ్యోతి):  ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు ఎస్ టి యు నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ అన్నారు మండలంలోని గౌరెడ్డిపల్లి గ్రామ ఉన్నత పాఠశాల వద్ద గురువారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు సిపిఎస్ రద్దు సాధించడంలో ఎస్ టి యు ముఖ్యపాత్ర పోషించిందని చెప్పారు ఎస్ టి యు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 26న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వెలమ ఫంక్షన్ హాల్ వద్ద వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాసభకు రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ ప్రధాన కార్యదర్శి పర్వత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు అనంతరం వజ్రోత్సవ వేడుకల గోడపత్రికలను విడుదల చేశారు ఉపాధ్యాయులు డాక్టర్ కె రఘురాంరెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.