అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి)..///.. మున్సిపాలిటీలోని ముక్తపుర్ అంగన్వాడీ-2 కేంద్రంలో పోషణ మాసోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి కొండమడుగు శ్రీయన్ష్ అక్షరాభ్యాసం కార్యక్రమం అలాగే చిన్నారి అన్నప్రసన్నం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోషణ మాసోత్సవాల్లో గర్భిణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ కొండమడుగు హేమలత మాట్లాడుతూ బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అలాగే ఇంటి పెరడులో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. అనంతరం పోషకాహార పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది కొండమడుగు సువర్ణ, ఆశా సిబ్బంది వాణి, మరాఠీ నాగమణి, మన్నెం మనోహర, కొండమడుగు రేణుక, గర్భిణులు చిన్నారులు పాల్గొన్నారు.
- 5 views