- జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌనీ రాజా రమేష్ యాదవ్
హలియా,సెప్టెంబర్26(ప్రజా జ్యోతి): కనకదుర్గ దేవి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్ అన్నారు.సోమవారం హాలియా మున్సిపాలిటీ ఆరవ వార్డులో నవగణపతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు హాజరై పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలని సూచించారు. అమ్మవారు అందరని చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలతో పాడి పంటలు పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నవగణపతి యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- 2 views