ప్రజా సమస్యలు పరిష్కరించాలి వార్డ్ సమస్యలపై కమిషనర్కు వినతి

Submitted by krishna swamy on Wed, 21/09/2022 - 15:50
Public problems should be solved  Petition to Commissioner on ward issues

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి).../  ప్రజా సమస్యలను పరిష్కరించాలని అని పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ బండారు నరసింహ అన్నారు.తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని 8వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య త్రాగడానికి మంచినీరు సమస్య  ఇల్లు కట్టుకున్న వారికి ఇంటి నెంబర్ సమస్యలపై పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డికి రాజీవ్ నగర్ ప్రజలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ బండారు నరసింహ మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాల్లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది గురవుతున్నారని అన్నారు. తక్షణం ప్రభుత్వం కాలనీలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తీర్చాలని ఆ ప్రాంతంలో ఉన్న స్మశాన వాటికకు చుట్టు ప్రహరీ గోడ నిర్మించాని ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కమిషనర్ను కోరడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక మున్సిపల్ కన్వీనర్ పగుడాల శివ జిల్లా నాయకులు గుణముని ఐలయ్య కడగంచి రాజేష్ బసవ రెడ్డి ధనరాజ్ జంగయ్య హరిబాబు జయశ్రీ భాగ్యమ్మ లక్ష్మి సరస్వతి పార్వతి కొండల్ రాజు తదితరులు పాల్గొన్నారు.