చేపలు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

Submitted by Ramesh Peddarapu on Mon, 26/09/2022 - 13:12
 A person died accidentally while going fishing

పాలక వీడు,సెప్టెంబర్25(ప్రజా జ్యోతి):  తేది 24.092022  శని వారం రోజు  రాత్రి మఠంపల్లి మండలం వరదాపురం గ్రామానికి చెందిన సాకె నరేష్, వయస్సు 25 సం!! తన మేన మామ అయిన  సప్పర్ నర్సిహ్మ తో పాలకవీడు మండలము  రాఘవపురం గ్రామ సమీపంలో గల  వేములురు వాగు లో చేపలు పట్టుటకు  వెళ్లి      వల వేసి ప్రమాద వశాత్తు అట్టి వలలో చిక్కుకొని నీటి లో పడి  చనిపోగా విషయం తెలుసుకున్న  తన తండ్రి వెంకన్న ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా యస్ ఐ సైదులు తెలిపారు. మృతుడికి వివాహం కాలేదు