తెలకపల్లి,అక్టోబర్ 30(ప్రజాజ్యోతి): మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ కు దిక్కెవరని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు ఆర్టీసీ అధికారులు బస్టాండ్ చుట్టూ డబ్బాలు వేయించి వ్యాపారాలు నడిపిస్తూ నెలసరి అద్దెలు వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు అద్దెలపై దృష్టి సారించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు కనీసం తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు ఆవరణను సిసి చేయకపోవడంతో గుంతల మయంగా మారి ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు రాత్రిపూట విద్యుత్తు లైట్ల ఏర్పాటు కూడా సక్రమంగా లేకపోవడంతో అంధకారంతో అవస్థలు పడుతున్నారు ఇక్కడి బస్టాండు కల్వకుర్తి లింగాల మరోవైపు నాగర్ కర్నూల్ అచ్చంపేట పట్టణాలకు మధ్యలో కేంద్రంగా ఉండడంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు వచ్చి పోతుంటారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ వసతులను మెరుగుపరిచి ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
- 3 views