ఓజో ఫౌండేషన్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న
హుజూర్ నగర్ అక్టోబర్ 2 ( ప్రజా జ్యోతి)./... నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గడపకు రఘు అన్న బతుకమ్మ కానుక అందించడమే లక్ష్యంగా ఓజో ఫౌండేషన్ పని చేస్తుందని ఫౌండేషన్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న అన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి అక్క చెల్లెకు రఘన్న బతుకమ్మ కానుకలు అందే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం పలు గ్రామాల బతుకమ్మ కమిటీలకు రఘు అన్న కానుకలు అందజేసారు.హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రఘు అన్న ఆశయమని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గ అక్కాచెల్లెళ్లకు ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు అన్న తరపున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగుల్ మీరా , సాయికృష్ణ,వినోద్, మధు,బొమ్మకంటి సైదులు, నవీన్ మహేందర్ రెడ్డి,సాయి విరాట్, వెంకటేష్, రవి, సాయిబాబా,నాగరాజు నవీన్,వినోద్, తదితరులు పాల్గొన్నారు
- 3 views