చిల్పూర్, సెప్టెంబర్ 19 , ప్రజా జ్యోతి: ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ స్మార్ట్ గ్రామపంచాయతీలు, గ్రామీణ వర్గాల సాధికారత అనే అంశంపై జరిగిన జాతీయ సర్పంచుల సదస్సుకు జనగాం జిల్లా చిల్పూరు మండలం శ్రీపతి పల్లి గ్రామ సర్పంచ్ కేశిరెడ్డి ప్రత్యూష మనోజ్ రెడ్డి ఎంపికై సదస్సులో పాల్గొనడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.ఈ సందర్భంగా సోమవారం చిల్పూరు మండలం శ్రీపతి పల్లి గ్రామ పంచాయతీ నందు ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా కడియం శ్రీహరి హాజరై గ్రామ సర్పంచ్ ప్రత్యూష మనోజ్ రెడ్డి లక్నోలోని సర్పంచుల సదస్సుకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం తరఫున హజరైనందున సర్పంచ్ ప్రత్యూష రెడ్డిని సన్మానించి అభినందనలు తెలిపారు.అనంతరం తమ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మామిడాల లింగారెడ్డి, రైతు కోఆర్డినేటర్ జనగాం యాదగిరి, టిఆర్ఎస్ నాయకులు కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, తాళ్ల పెళ్లి సంపత్ కుమార్ గౌడ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ నాయకులు ఇల్లందుల సుదర్శన్ ,తాళ్ల పెళ్లి సమ్మయ్య గౌడ్, బల్దే వెంకన్న, టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్