తెలకపల్లి, సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి): మండల కేంద్రానికి చెందిన అనారోగ్య బాధితుడు సంగెంగౌడ్ మెరుగైన వైద్యం కోసం రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం గురువారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు కొద్ది కాలంగా జాండీస్ హెర్నియాతో బాధపడుతున్న సంగెంగౌడ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు మంజూరు చేయించారు ఈ సహాయాన్ని ఎల్ ఓ సి ద్వారా ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదుల నరేందర్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు చెన్న నరసింహ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ నాయకులు సొంటె శీను బారిగారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- 1 view