విఘ్నేశ్వరుని దయతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి

Submitted by sai teja on Sat, 10/09/2022 - 14:22
May all people be happy and peaceful with the grace of Lord Vigneswara


తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్

 అనంతగిరి, సెప్టెంబర్ 9, ప్రజాజ్యోతి:  విఘ్నేశ్వరుని దయతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అన్నారు. అనంతగిరి మండల కేంద్రంలోని రంగనాథ  యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ... విఘ్నేశ్వరుని దయతో ప్రజలందరూ పాడిపంటలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరారు. గణపతి నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో  జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు కులమత బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం ఐక్యమత్యం కు ప్రతీక అన్నారు .ఈ సంవత్సరము లాగానే నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా అన్నారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.