క్యాన్సర్ బారిన పడి మరణించిన కుంభాల లక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించిన కనుకుంట్ల కుమార్

Submitted by Srikanthgali on Thu, 10/11/2022 - 18:17
రెస్ట్ ఇన్ పీస్ మై డియర్ సిస్టర్
  • క్యాన్సర్ బారిన పడి మరణించిన కుంభాల లక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించిన కనుకుంట్ల కుమార్
  • కొత్తగూడెం క్రైమ్, నవంబర్ 10, ప్రజాజ్యోతి:
  • బూడిదగడ్డ మాజీ కౌన్సిలర్ అయినటువంటి కనుకుంట్ల కుమార్ బూడిదగడ్డ వాస్తవ్యురాలు కుంభాల లక్ష్మి మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని కుంభాల లక్ష్మీ భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. తాను పనిచేసిన దగ్గర నుండి ప్రతి విషయంలో అన్నా అంటూ పలకరించిన చేల్లి ని కోల్పోవడం నిజంగా బాధగా అనిపిస్తుంది అన్నారు. నన్ను నన్నుగా భావించి ప్రేమించే వారి కోసం ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంటానని కనుకుంట్ల కుమార్ తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న ఏరియా వాస్తవ్యులకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తన వంతు సహాయంగా ప్రతి సమస్య విషయంలో పరామర్శ కాకుండా ప్రాతిపదికన నిరుపేద కుటుంబ ఆర్థిక ఆసరాలో అన్నలా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు.