జోరుగా గుట్కా దందా
సుజాతనగర్ అక్టోబర్ 11 ప్రజాజ్యోతి. ప్రభుత్వం నిషేదించిన గుట్కా వ్యాపారం సుజాతనగర్ మండలం లో జోరుగా సాగుతుంది . అధికారులు మండలం లో గుట్కా మాపీయ అరికట్టడం లో విఫలం అయినారు అని ప్రజలో ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కనిపించే వ్యాపారం ఒకటి షాపులు అడ్డగా పేట్టుకోని వేనక జోరుగా గుట్కా దందా వ్యాపారం. సిరిపురం గ్రామ చివరిలో నివాసం ఉండే వ్యక్తి మండలం అంతాట గుట్కా సరపరా అతనిదే ఉదయం సాయంత్రం సమయాలలో మోటారు సైకిలు పై గుట్కా ప్యాకేట్లని మండల కేంద్రంలోని అనేక గ్రామాలకి తరలిస్తున్నారు అని చర్చ జోరుగా సాగుతుంది. హోల్ సేల్ ధరలకే గుట్కా ప్యాకేట్లని కోనుగోలు చేసి అధిక ధరలకి అమ్ముతు సోమ్ము చేసుకుంటున్నారని వీళ్ళ వ్యాపారం ఒక్కో పాన్ షాపుకి రోజు వారి 2000 రూ నుండి 4000 రూ వరకు గుట్కాల పై ఆదాయం వస్తుందని సమచారం. మండలములోని అనేక ప్రాంతాలకు గుట్కా సరపరా చేస్తు లక్షల లో వ్యాపారం కోనసాగిస్తున్నారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మాకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని మాకు అడ్డు చేప్పేది ఏవరు అని అడిగిన వారి పై బేదిరింపులకి పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్న మండలం లో అధికారులు నిషుా వ్యవస్థ ఏమి చేస్తున్నారని ప్రజలు ఆ శాఖ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు నిద్రవస్థ నుండి మేల్కోని గుట్కా చీకటి దందా గుట్టు వీప్పల్సీన అవసరం ఏంతైన ఉందని ప్రజలు కోరుతున్నారు...
- 49 views