అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు: ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్

Submitted by bosusambashivaraju on Fri, 16/09/2022 - 12:56
Grant of support pensions to all eligible: MLA, ZP Chairman

చిల్పూర్, సెప్టెంబర్ 15, ప్రజా జ్యోతి:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్ భాగాల సంపత్ రెడ్డి లు అన్నారు. ఈ సందర్భంగా గురువారం చిల్పూరు మండలం పల్లగుట్ట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో సర్పంచ్ బొట్టు మానస అధ్యక్షతన నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు , భూమిపూజలు, మహిళ సమాఖ్య భవనం , వెటర్నరీ సబ్ సెంటర్ నిర్మాణాలకి భూమిపూజ చేసిన అనంతరం గ్రామంలో  నిర్వహించిన దళితబంధు కృతజ్ఞత సభకు  హాజరయ్యారు.అనంతరం 
పల్లగుట్ట గ్రామానికి  కొత్తగా మంజూరైన ఆసరా పించన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య,  జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ గుట్ట దేవస్థాన కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు,ఏఎంసీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబుతోపాటు నియోజకవర్గంలోని ఎంపీపీలు , జడ్పీటీసీలు , మండల పార్టీ అధ్యక్షులు , ఇతర చైర్మన్స్ , ముఖ్య నాయకులు , సర్పంచులు , ఎంపీటీసీలు , పార్టీ ప్రతినిధులు , సంబంధిత శాఖల అధికారులు , ఆసరా పించన్ కార్డుల లబ్ధిదారులు , గ్రామప్రజలు, పార్టీ శ్రేణులు తదితరులు  పాల్గొన్నారు.