విద్యతోనే బంగారు భవిష్యత్తు - సర్పంచ్ దోటి కుమార్ యాదవ్

Submitted by krishna swamy on Mon, 19/09/2022 - 16:39
Golden future with education - Sarpanch Doti Kumar Yadav

స్కూల్ విద్యార్థులకు బ్యాగులు నోట్ బుక్స్ పంపిణీ

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి)... విద్యతోనే బంగారు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవాలని సర్పంచ్ దోటి కుమార్ యాదవ్ అన్నారు. భూదాన్ పోచంపల్లిమండలంలోని దంతూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక  పాఠశాలలో  పోచంపల్లి అరవింద్ విజయకుమార్ సహకారంతో స్కూల్ విద్యార్థులకు సర్పంచ్ దోటి కుమార్ యాదవ్ చేతుల మీదుగా బ్యాగ్స్ నోట్ బుక్స్  ప్యాడ్స్ పెన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ బొదసు శ్రీను  వార్డు సభ్యులు యు. లింగస్వామి పి. పండమ్మ జి. పద్మ పి. సునీత  వై. లావణ్య బి. రమేశ్ ఎమ్. సత్తిరెడ్డీ కో ఆప్షన్ సభ్యులు జె. శంకరయ్య పి. నర్సింహ ఎమ్. మంగమ్మ  ఎస్.ఎమ్.సి చెర్మన్ సిద్దగొని సైదులు  ఆర్.కేర్ రమాదేవి   టీచర్స్ జేయశ్రి యు. అంజయ్య   శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.