హలియా,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి): బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ భావితరాలకు ఆదర్శమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.మంగళవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకలకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బాపూజీ ఉద్యమకారుడిగా, ప్రజాస్వామ్యవాదిగా,పీడిత ప్రజల పక్షపాతిగా,నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడని ఆయన కొనియాడారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు.బాపూజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ, శంకరయ్య,యడవల్లి మహేందర్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు,మండల ప్రధాన కార్యదర్శి యనమల సత్యం,పట్టణ అధ్యక్షుడు చేరుపల్లి ముత్యాలు,సురభి రాంబాబు,దోరేపల్లి వెంకటేశ్వర్లు,ఎంపీటీసీ ఉర్లగొండ వెంకటయ్య, కౌన్సిలర్లు వర్ర వెంకటరెడ్డి, నల్లబోతు వెంకటయ్య,ప్రసాద్ నాయక్,అన్నేపాక శ్రీను,చాపల సైదులు,రావుల లింగయ్య, బందిలి సైదులు,బుర్రి మొగులయ్య,గడ్డం రమణ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
- 3 views