రజక సంఘము నూతన కార్యవర్గం ఎన్నిక

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 16:27
 Election of the new executive committee of Rajaka Sangha

   
చిట్యాల సెప్టెంబర్ 20(ప్రజాజ్యోతి)../ చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి రజక సంఘమును మంగళవారం మాజీ కార్యవర్గం సభ్యులు ఆనగంటి సైదులు, గుండేపూరి శేఖర్, దూదిగాం అంజయ్య ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. నూతన అధ్యక్షుడుగా ఆనగంటి నరేష్, ఉపాధ్యక్షుడుగా గుండేపూరి సైదులు,కార్యదర్శిగా గుండేపూరి లింగస్వామి,కోశాధికారిగా దూదిగాం లింగస్వామి, ఐదుగురు డైరెక్టర్లు, గౌరవ సలహాదారులుగా గుండేపూరి చిన్న నర్సింహ,సత్తయ్య,దూదిగాం యాదయ్య, ఆనగంటి లింగస్వామి ప్రచార కమిటీ సభ్యులుగా గుండేపూరి రాజు ని ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పెద్దకాపర్తి రజక సంఘము యొక్క అభివృద్ధి ద్యేయంగా పని చేస్తామని త్వరలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు చేపడతామని వారు తెలిపారు.ప్రభుత్వం నుంచి వచ్చే  పథకాలు రజకులకు అమలు చేయడం కోసం తప్పనిసరి కృషి చేస్తామన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి రజక బంధు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఆనగంటి లింగస్వామి, దూదిగాం నర్సింహ, మహేష్, కోటయ్య, గుండేపూరి యాదయ్య, రాములు, చంద్రయ్య, శ్రీను, మారయ్య, ఆనగంటి లింగయ్య, యాదయ్య, మహాలింగం, ముత్తయ్య, గణేష్,  సతీష్,అశోక్, అనిల్, తిరుమలేష్, నవీన్, అంజి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.