మోటమర్రి గ్రామ బీడు భూముల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బోనకల్,సెప్టెంబర్23, ప్రజాజ్యోతి:
మండల పరిధిలోని మోటమర్రి గ్రామ బీడు భూముల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహన్ని గ్రామస్తుల సమాచారం మేరకు బోనకల్ ఎస్సై తేజావత్ కవిత సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించారు. సుమారు పది రోజుల క్రితం మృతుడు మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన వ్యక్తి యొక్క ముఖ భాగం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. మృతుడు మోటమర్రి గ్రామానికి చెందిన వంగాల నరసింహం (45) గా అతని కుటుంబ సభ్యులు గుర్తించారు.మృతుడు యొక్క భార్య గత కొంత కాలం క్రితం మరణించడంతో అతని యొక్క మానసిక స్థితి సరిగా లేదని గ్రామస్తులు తెలియజేశారు.అందువల్లనే పది రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం తెలియజేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.