పాలక వీడు,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి): పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గాకు వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ మూలమలుపులో మోకాలు లోతు గుంతలు పడి ఉన్నాయి. ఈ రోడ్డు నుండి నిత్యం రెండు సిమెంటు ఫ్యాక్టరీలకు పనికి వందల మంది పోయి వస్తుంటారు. జాన్ పాడు సైదులు దర్గా దగ్గరకు శుక్రవారం, ఆదివారం వేల మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై రెండు మూలమలుపుల వద్ద పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడి ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు గుంతలు కానరాక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నందున,ప్రమాదం జరగకముందే ఈ యొక్క గుంతల్ని పూడ్చల్సిందిగా సంబంధిత శాఖ వారిని ప్రజలు కోరుతున్నారు.b
- 6 views