మూల మలుపులో పొంచి ఉన్న ప్రమాదం

Submitted by Ramesh Peddarapu on Wed, 28/09/2022 - 10:23
Danger lurks around the corner

పాలక వీడు,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి):  పాలకవీడు మండలం జాన్ పహాడ్   దర్గాకు వెళ్ళే దారిలో  ఫ్లైఓవర్ మూలమలుపులో మోకాలు లోతు గుంతలు పడి ఉన్నాయి. ఈ రోడ్డు నుండి నిత్యం రెండు   సిమెంటు ఫ్యాక్టరీలకు పనికి వందల మంది పోయి వస్తుంటారు. జాన్ పాడు సైదులు దర్గా దగ్గరకు శుక్రవారం, ఆదివారం వేల మంది   భక్తులు వస్తూ  పోతూ   ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై రెండు మూలమలుపుల వద్ద పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడి ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు గుంతలు కానరాక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నందున,ప్రమాదం జరగకముందే ఈ యొక్క గుంతల్ని పూడ్చల్సిందిగా సంబంధిత శాఖ వారిని ప్రజలు కోరుతున్నారు.b