గీతాంజలి విద్యానికేతన్ లో బాలల దినోత్సవం వేడుకలు
కొత్తగూడెం క్రైమ్, నవంబర్ 14, ప్రజాజ్యోతి:
ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు పట్టణంలోని గల పాఠశాలలో అంగరం వైభవంగా జరిగాయి. పట్టణంలోని గీతాంజలి విద్యానికేతన్ స్కూల్లో పిల్లలు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతోటి అలరించారు. స్కూల్ కరస్పాండెంట్ పసుపునుటి రమేష్ మాట్లాడుతూ దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు బాలల దినోత్సవం గా ప్రతి ఏటా నిర్వహించుకుంటున్నామన్నారు. చాచా నెహ్రూగా మనందరం ఆయనను పిలుచుకుంటూ స్మరించుకుంటాం, చాచా నెహ్రూకి పిల్లలంటే అమితమైన ప్రేమ ఉంటుందని అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవం గా అంగరంగ వైభవంగా జరుపుకుంటామని అన్నారు. చాచా నెహ్రూ స్వాతంత్ర సమరయోధంలో పాల్గొని దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయులలో ఒకరన్నారు. పిల్లలందరికీ చాచా నెహ్రూ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు