డిసిసి ప్రధాన కార్యదర్శి కాకునూరీ నారాయణ గౌడ్
హలియా,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర అమోఘమని డిసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్ అన్నారు. మంగళవారం హలియా మున్సిపాలిటీ ప్రధాన కూడలి నందు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు కూకడాల ఆంజనేయులు ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు తొలి దశ పోరాటంలో చురుకుగా వ్యవహరించడమే కాకుండా బీసీల ఐక్యత కోసం నిర్విరామంగా శ్రమించిన వ్యక్తి, ఉన్నత విలువలతో పోరాటం చేసిన యోధుడని పొగిడారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ఫలించాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పోధిల కృష్ణ,యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్,మిట్టపల్లి వాసులు,మజహార్ మొయినుద్ధీన్,పాండు నాయక్, పాంపాటి శ్రీనివాస్,గడ్డం రమణయ్య,నామిని సుధాకర్, కమతం రామాంజిరెడ్డి, నకిరేకంటి సైదులు,రావుల శ్రీనివాస్,రాపోలు వాసు తదితరులు పాల్గొన్నారు.
- 1 view