పాలక వీడు,సెప్టెంబర్26(ప్రజా జ్యోతి): చాకలి ఐలమ్మ 125 వ జయంతి ఉత్సవాలను మండల ప్రజా పరిషత్ పాలకీడు నందు మండల పరిషత్ అధ్యక్షులు భూక్య గోపాల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ రజాకార్ల ని ఎదిరించిన వీర వనిత ఐ లమ్మ ఆమె జీవితం నేటి మహిళలకు ఆదర్శం అని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీహరి, బెట్ట తండ సర్పంచ్ మోతిలాల్, టైపిస్టు యన్. పిచ్చయ్య, కార్యాలయ సిబ్బంది ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
- 2 views