కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం గూడూరు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల 60 కుటుంబాలు శుక్రవారం మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి శంకర్ నాయక్ పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి ప్రతి గడపకు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని ఆయన అన్నారు ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేలా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుజాత మోతిలాల్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ రెడ్డి జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండి కాసిం నూకల సురేందర్ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- 3 views