మునుగోడు సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): కొంపెల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్నటువంటి గ్రామకంట భూమిని కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా గృహ నిర్మాణ పనులను చేపట్టారు. ఇట్టి పనులను గ్రామంలో ఉన్నటువంటి యాదవ కులస్తుల మరియు వారి పూర్వీకుల సమాధులను కూల్చివేసి ఇంటి నిర్మాణం పనులు చేపట్టి భూమిని కబ్జా చేశారు, ఆ గ్రామంలోని ప్రజలు యాదవులకు సంబంధించిన వారు వారి పూర్వీకుల సమాధులను త్రవ్వించి అట్టి భూమిని కబ్జాదారులు కబ్జా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు .ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని గ్రామకంఠ భూమిని సర్వే చేసి మరియు నిజనిర్ధారణ చేసి యాదవ స్మశాన వాటికకు అప్పగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
- 2 views