చౌటుప్పల్ సెప్టెంబరు 19( ప్రజా జ్యోతి): బిజెపి టిఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ఎండగాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా బూత్ కమిటీ అధ్యక్షులు పనిచేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ గీత రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ నినాదంతో ప్రచారం చేపడుతున్న మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డికి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వందల కోట్ల రూపాయలు కలిగిన బిజెపి టిఆర్ఎస్, పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన లొంగకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ధన బలం కలిగిన బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ప్రజాబలం కలిగిన కాంగ్రెస్ పార్టీ ముందు తలవంచక తప్పదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోఆర్డినేటర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ
మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టకరమైన ఎన్నికని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి98,000 ఓట్లను22 వేల కోట్ల కోసం అమ్ముడు అమ్ముడుపోయారన్నారు. తన స్వార్థ ప్రయోజనాలు కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డిని ఓడించి, మునుగోడు ఓటర్లు గుణపాఠం చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి, జనరల్ సెక్రెటరీ శివకుమార్ యాదవ్, రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి, విజయ రెడ్డి, విద్యా రెడ్డి , భూతం ప్రమోద్ కుమార్, వరలక్ష్మి, గుంజ రేణుక, తిరుపతి రవీందర్, సుర్వి నరసింహ గౌడ్, చిక్క నరసింహ, ముప్పిడి సైదులు గౌడ్, శ్యాంసుందర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.