"ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం"

Submitted by Kramakanthreddy on Sat, 24/09/2022 - 13:51
"Free Eye Medicine Camp under OBC Morcha Successful"


--- జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ యాదవ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 23 (ప్రజాజ్యోతి ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది.  శుక్రవారం జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో  పాలమూరు పట్టణం టీటీగుట్టలోని ఫైర్ స్టేషన్ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ప్రముఖ కంటి వైద్యులు ప్రదీప్ కుమార్ యాదవ్ వైద్య శిబిరానికి వచ్చిన వార్డు ప్రజలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలను ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలంతా తన కుటుంబం గా భావించి ప్రతినిత్యం ప్రజా సేవ కు పాటుపడుతున్న వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఓబీసీ మోర్చా జిల్లా శాఖ తరఫున కంటి వైద్య పరీక్షలకు ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాల అమలు కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తున్నారని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అచ్చుగట్ల అంజయ్య నాయకులు నారాయణ యాదవ్ ,సంపత్ కుమార్, వేణు నాగరాజు వాల్మీకి, గోపాల్ ,రమేష్. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.