తోటి ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఉద్యోగులు

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 09:53
Employees who provided financial support to the family of a fellow employee

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి):  తోటి ఉద్యోగి అనారోగ్యంతో  మృతి చెందగా ఉద్యోగులంతా కలిసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి  తమ మంచితనాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే  మహబూబాద్ జిల్లా గూడూరు మండలం లో 108 పైలట్ గా వక్కేల్లి లక్ష్మణ్ విధులు నిర్వహిస్తున్న క్రమం లో అనారోగ్య సమస్య తో మృతి చెందడం జరిగింది. లక్ష్మణ్ కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఉద్యోగులు అధికారులు అంత కలిసి విరాళాలు జమ చేసి తొంబై ఐదు వేల రూపాయలను సుకన్య యోజన పథకం కింద మృతుని పాప పేరు మీద జమ చేశారు. ఈ కార్యక్రమం లో 108 ప్రాజెక్ట్ మేనేజర్ శివ కుమార్,వద్ది హరీష్, రాము,విజేంధర్,జనార్దన్,చంద్రశేఖర్, రమేష్, పప్పుల వెంకన్నా, బాలాజీ,దస్తగిరి,చంద్ర సేన, హనుమంతు, బుచ్చిరెడ్డి,నరేష్ తది తరులు పాల్గొన్నారు.