సీఎం రిలీఫ్ ఫండ్ వివిధ గ్రామాలకు చెక్కుల పంపిణీ

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 17:34
Distribution of CM Relief Fund checks to various villages

సెప్టెంబర్ 8 (ప్రజా జ్యోతి)  మద్దిరాల మండలం లోని వివిధ  గ్రామాలకు చెందిన వారు  అనారోగ్యంతో  హాస్పిటల్ లో చేరగా , తుంగతుర్తి శాసనసభ్యులు  గౌ.శ్రీ. డా. గాదరి కిశోర్ కుమార్ గారి  ఆశీస్సులతో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయగా  ,మద్దిరాల గ్రామానికి  చెందిన భూతం నాగయ్య కు  40000 రూపాయల చెక్కు, మెడిదుల వెంకన్న 17000, గోరెంట్ల గ్రామానికి చెందిన పాల్వాయి విజయ కు 38500,జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన v. కలమ్మ 30000,చౌళ్ల తండ కు చెందిన B. సైదమ్మ 60000,చిన్న నేమిల గ్రామానికి చెందిన S.పాపయ్య 50000, గుట్టకాడి తండ కు చెందిన బాణోత్ లాలి 24000,పడిమటి తండ కు చెందిన D. మౌనిక, పిర్యా తండ కు చెందిన B. భద్రు 20000, మామిడ్ల మడవ కు చెందిన షేఖ్ యాకుబ్ 24000, ముకుందాపురం గ్రామానికి చెందిన N. జ్యోతి 37500, షేఖ్ సుల్తాన 60000 రూపాయల చెక్ లు మంజూరు అయినవి. అట్టి చెక్కలను ఈ రోజు తిర్మలగిరి MLA గారి క్యాంపు ఆఫీసు లో  తుంగతుర్తి శాసనసభ్యులు  గౌ.శ్రీ. డా. గాదరి కిశోర్ కుమార్ గారు అందచేసినారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ SA రజాక్  ,  వైస్ ఎంపీపీ  బెజ్జంకి శ్రీరాంరెడ్డి,జిల్లా నాయకులు గుడ్ల వెంకన్న,  కన్న వీరన్న గౌడ్, మండల కో ఆప్షన్ నెంబర్  సాహబ్ హుస్సేన్ ,సర్పంచ్ లు  దామెర్ల వెంకన్న,లావుడియా వెంకన్న,వీరన్న,  ఎంపీటీసీ శిరంశెట్టి వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షులు వడ్డాణం మధుసూదన్ , బద్దం అమృతారెడ్డి,గంగవేల్లి వెంకట నరసింహ్మ రావు, నాయకులు రావుల వెంకన్న, జిలకర చంద్రమౌళి, కొలగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు*.