విద్యుత్ షాక్ కు గురై భవన నిర్మాణ కార్మికుడు మృతి.

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 13:03
Construction worker died due to electric shock.

ఆందోళన చేపట్టిన బంధువులు ప్రజాసంఘాల నాయకులు.

అచ్చంపేట సెప్టెంబర్ 24 ప్రజా జ్యోతి. అచ్చంపేట పట్టణంలో మధురానగర్ కాలనీలో భవన నిర్మాణం పనులు చేస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఓ కార్మికుడు మృతి చెందాడు శనివారం భవన నిర్మాణం పనులు భాగంగా గుంపల్లి గ్రామానికి చెందిన లస్కర్ 38 అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి మధురానగర్ కాలనీలో నివాసం ఉంటూ నూతన భవనం పనులు చేస్తుండగా విద్యుత్ ప్రమాదం జరిగింది. దీనికి నిరసనగా మృతిని బంధువులు సిపిఎం కాంగ్రెస్ పార్టీ ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్ ని లస్కర్ కుటుంబానికి అందే విధంగా చూస్తామని అదేవిధంగా ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయం చేస్తుందని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ బిజెపి నాయకులు మంగ్య నాయక్ గిరిజన సంఘం నాయకులు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్.నిరసన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు.