మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరిన రామవరం, రామేశ్వరం గ్రామాల కాంగ్రెస్ ,బీజేపీ కార్యకర్తలు

Submitted by narmeta srinivas on Sun, 13/11/2022 - 17:31
మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరిన రామవరం, రామేశ్వరం గ్రామాల కాంగ్రెస్ ,బీజేపీ కార్యకర్తలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

పాలకుర్తి /కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 13 : :కొడకండ్ల మండలంలోని రామవరం, రామేశ్వరం,గ్రామాలకు చెందిన 15 మంది కాంగ్రెస్,బిజెపి పార్టీ కార్యకర్తలు డీసీసీబీ వైస్ చైర్మన్ కుందురు వెంకటేశ్వరరెడ్డి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ ఆధ్వర్యంలో ఆదివారం హన్నంకొండ లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కార్యాలయంలోమంత్రి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా మంత్రి వారికి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో కాగ్రెస్ పార్టీ రామేశ్వరం గ్రామ ఉప సర్పంచ్ అర్కే సరితా దుర్గయ్య, బీజేపీ పార్టీ నుండి గువ్వ నర్సింహా, కాగ్రెస్ పార్టీ రామవరం గ్రామం నుండి  తోట మురళి,8 వవార్డు మెంబర్ మాజి వార్డు మెంబర్ బొమ్మగాని యాకలక్మి శ్రీనివాస్, ఎడెల్లి ఐలయ్య, తోట విష్ణు, బొమ్మగాని ఆంజనేయులు, చెంచు ఉమేష్, సైదులు, కౌడగని రాజు, దూదిగాని సోమేశ్, నరగా లిగన్న,తదితరులు పార్టీలోకి చేరారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ సిఎస్ వైస్ చైర్మన్ మేటి సోమరములు, రామేశ్వరం సర్పంచ్ జాటోత్ రాములు,ఏఎంసి డైరెక్టర్ సోమేశ్వరరావు ,గ్రామపార్టీ ఇంచార్జి బాకి ప్రేమకుమార్, సీనియర్ నాయకులు, కటారి కృష్ణమూర్తి ,మండల యూత్ అధ్యక్షుడు సతీష్ గౌడ్,నాయకులు మందుల మల్లేష్,పెద్ద బావి తండా సర్పంచ్ సునీత రమేష్, ఉప సర్పంచ్ అశోక్,రామేశ్వరం గ్రామపార్టీ అధ్యక్షుడు మేటి శ్రీనివాస్, మేటి నరసింహస్వామి, వార్డు మెంబర్ తాడోజి సోమరములు,సిందే సందీప్, గ్రామ యూత్ అధ్యక్షుడు రణధీరు ,కరుణాకర్, వినోద్,కె శ్రీనివాస్,రమేష్, మహిదర్,తదితరులు పాల్గొన్నారు.